Finanacial Assistant : వంకాయగూడెం గ్రామానికి చెందిన మూల రాకేష్ ఇటీవల పాల వాహనం నడుపుతూ విద్యుత్ షాక్తో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆయన కుమార్తె మూల శాన్వి పేరపై నాగార్జున డెయిరీ యాజమాన్యం రూ.1,50,000లను తాడికల్ పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్గా జమ చేసింది.
ఈ పత్రాలను స్వీకరించిన రాకేష్ భార్య లావణ్య, ఆమె తల్లిదండ్రులు, రాకేష్ తల్లిదండ్రులు మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు, ఏజీఎం ఆకునూరి సుధాకర్, సిసిఎం మల్లారెడ్డి, సూపర్వైజర్ నరేష్లకు కృతజ్ఞతలు తెలిపారు.
-శెనార్తి మీడియా, శంకరపట్నం:
