ReUnion:మురిసిపోయిన క్షణాలు.. ఒడిసిపట్టుకున్న జ్ఞాపకాలు..కాలం పంచిన అనుభవాలతో వారంతా తడిసిముద్దయ్యారు. రెండు దశాబ్దాల క్రితం బడిని విడిచి వెళ్లినప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ, తమ గురువుల పాదాలను తాకి ఉద్వేగానికి లోనయ్యారు .ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఉపాధ్యాయుల మాటలను అనునిత్యం గుర్తు చేసుకుంటున్నామని, అవే నేడు తమ ఎదుగుదలకు మార్గాలయ్యాయని చెబుతూ గుండె తడిని కన్నీటి జడిగా మార్చుకున్నారు. ఇదంతా గాగిల్లాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చోటుచేసుకుంది.

గాగిల్లాపూర్లోని జిల్లా పరిషత్ హై స్కూల్(GagillapurZPHS)లో 2004- 2005 బ్యా్చ్ పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు పలువురు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక్క చోటికి చేరారు. తమ గురువులను కనులారా చూసుకుని మురిసిపోయారు. ఉపాధ్యాయులు(Teachers) లక్ష్మీబాయి, జ్యోతి, వెంకట్రెడ్డి, రాజమౌళి, సతీష్, పాపిరెడ్డి ల మాటలను మరోసారి వింటూ సంబరపడిపోయారు. ఒకనాడు తరగతి గదిలో పాఠాలను విన్న పూర్వ విద్యార్థులు నేడు జీవిత పాఠాలను వింటూ తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

విద్యార్థులు తమ తమ వృత్తిని , ప్రస్తుత జీవన గమ్యాలను ఒక్కొక్కరు చెబుతూ ఉంటే వేదికపైనున్న టీచర్లంతా తమ శిష్యుల ఎదుగుదలను చూసి ఉబ్బితబ్బియ్యారు. గురువుల ఆశిస్సులే నేటి తమ విజయాలకు కారణమంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తమ పిలుపు మేరకు దూరాభారాలను లెక్క చేయకుండా విచ్చేసిన టీచర్లకు పాదాభివందనం చేశారు.
ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న వారిలో మాసం నాగరాజ్,శ్రీనివాస్,రమేశ్, శ్రీకాంత్, స్వరూప, రాణి,ప్రియాంక, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, బెజ్జంకి