rasamai

Rasamai: బీఆర్ఎస్ మహిళా లీడర్ల నిర్ణయంపై స్పందించిన రసమయి

  • ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తెలంగాణ  సాకారం
  • పదేళ్లు కేసీఆర్ ను సీఎంగా దీవించింది ఆడబిడ్డలే
  • మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ 

Rasamai: ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను ముందుండి నడిపి, రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినది ఆడబిడ్డలేనని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఆగం కావొద్దని,  ‘సారూ మీరుంటేనే  రాష్ర్టం అభివృద్ధి చెందుతుందని పదేళ్లు కేసీఆర్   దీవించి సీఎం చేసింది ఆడబిడ్డలే’నని  మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు.   ఏప్రిల్ 27న వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ దారి ఖర్చుల కోసం పార్టీ బెజ్జంకి   మహిళా విభాగం నాయకులు చేపట్టిన కార్యక్రమంపై  రసమయి స్పందించారు. మహిళా విభాగం నేతల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. వరంగల్ సభ దారి ఖర్చుల కోసం గాను మహిళా విభాగం నాయకులు సోమవారం బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ లో రైతు బాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో  మక్కజొన్న కంకులు ఏరేందుకు వెళ్లారు.  కూలీపనులకు వెళ్లేందుకు వెళిలన ఆడబిడ్డలకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఉద్యమ సమయం నాటి పలు విషయాలను రసమయి గుర్తు చేశారు.  తెలంగాణ ఆడబిడ్డలు తెలంగాణ ఉద్యమాన్ని  ముందుండి నడిపారని గుర్తు చేశారు. స్వరాష్ట్రం ఇవ్వాలని అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఎదుట బతుకమ్మ ఆడి తమ నిరసన తెలిపారని గుర్తు చేశారు. వంటావార్పు కార్యక్రమాలతో ఉద్యమాన్ని ఉరకెలెత్తించారని చెప్పారు. స్వరాష్ర్ట ఏర్పాటు తర్వాత ఉద్యమ సారథి కేసీఆర్ సీఎంగా ఉండాలని దీవించింది మహిళలేనని గుర్తు చేశారు.

ప్రస్తుతం వరంగల్ లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు  పార్టీ  వాహనాలను ఏర్పాటు చేస్తుందని చెప్పినా కూడా ఆడబిడ్డలు తమ సొంత ఖర్చులతోనే  సభకు వస్తామని, ఇందు కోసం  కూలలీ పని చేసిన ఆడబిడ్డలకు శతకోటి వందనాలు తెలిపారు.  తెలంగాణ రాష్ట్రం సాధించింది గులాబీ పార్టీ అని, గులాబీ పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు.  ఆడబిడ్డలే సొంతంగా వాహనాలు పెట్టుకుని వస్తామని నిర్ణయం తీసుకోవడం వారి అభిమానానికి నిలువెత్తు నిదర్శనమని, ఈ సందర్భంగా వారికి  ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్ లేకుంటే కాళేశ్వరం లేదు… మధ్యమానేరు లేదు… ఇయ్యాల అనంతగిరి రిజర్వాయర్ ద్వారా వస్తున్న కాల్వ నీళ్లతో బీడు భూముల్లో సైతం పుట్లకొద్ది ధాన్యం,మక్కజొన్నలు పండుతున్నాయంటే కారణం కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం నీళ్లతోనని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.  పదేళ్లలో మానకొండూర్ ఎమ్మెల్యే గా రసమయి బాలకిషన్  కాల్వలు తెచ్చిన పుణ్యాన్నే ఇయ్యాల్ల మా బతుకుల్లో ఆనందం ఉందని రైతులు పేర్కొంటున్నారు. రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యానా సాగు నీళ్లు ఇవ్వడానికి కారణమైన కేసీఆర్ పెట్టబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేము సైతం తరలివస్తామని రైతులు అంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా దండు కదలబోతున్నదని తెలుస్తున్నది.

– శెనార్తి మీడియా, బెజ్జంకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *