Review: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ నెల 28న జ్యోతి నగర్ జిల్లా పరిషత్ పాఠశాల, ఎన్టీపీసీ పరిధిలో జరిగే 2400 మెగావాట్ల కొత్త ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లపై ఈ సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి అదనపు కలెక్టర్ వేణు, డీసీపీ చేతన, రెవెన్యూ, ఎన్టీపీసీ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సమావేశం జరిగే ప్రదేశంలో బందోబస్తు చర్యలు, ట్రాఫిక్ డైవర్షన్, పార్కింగ్ స్థలాలు, ప్రజల ఎంట్రీ-ఎగ్జిట్ దారులు, బారికేడింగ్ వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే గ్రామాలు, ప్రజల సంఖ్య, ముఖ్య అతిథుల వివరాలు, పాస్ల జారీ, భోజనాల ఏర్పాట్లను వివరించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు.ఎన్టీపీసీలో 2400మెగావాట్ల కొత్త ప్లాంటు నిర్మాణానికి ఈ నెల 28న చేపట్టనున్న ప్రజాభిప్రాయ సేకరణ అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కోరారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం భద్రత ఏర్పాట్లపై రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ వేణు, పెద్దపల్లి డీసీపీ చేతన, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులతో సీపీ శుక్రవారం సమీక్ష జరిపారు. బందోబస్తుకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు, పబ్లిక్ ఎంట్రీ, ఎగ్జిట్ దారులు, క్యూఆర్డీల ఏర్పాటు, ఇతర ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏన్టీపీసీ సీజీఎం బి.కె. శికధర్, తదితర అధికారులు పాల్గొన్నారు.
