Robbery : శంకరపట్నం మండలం కన్నాపూర్లో ఓ చికెన్ సెంటర్ లో కోళ్లు చోరీకి గురయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కన్నాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రజాక్ చికెన్ సెంటర్ chicken shop) నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని వ్యక్తులు చికెన్ సెంటర్లో జాలి తాళాలు పగలగొట్టి 25 ఫారం కోళ్లతో పాటు 15 జుట్టు కోళ్లను ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు. వీటి విలువ రూ. 8 వేల వరకు ఉంటుందని వివరించారు.
ఇటీవల సోకిన బర్డ్ ఫ్లూ కారణంగా గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమయంలో న కోళ్లు చోరీకి గురవడంపై ఆందోళన చెందుతున్నాడు. కోళ్లను ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి తమకు న్యాయం చేయాలని బాధితుడు రజాక్ కోరాడు. చోరీపై కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.
శెనార్తి మీడియా,శంకరపట్నం :