- నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల
- బాసర ఆలయంలో ఏర్పాట్ల పర్యవేక్షణ
Basara: బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు, సిబ్బందికి ఆమె సూచించారు.
భైంసా డీఎస్పీ అవినాష్, ముథోల్ సీఐ మల్లేష్, ఎస్ఐ గణేష్ లతో కలిసి బాసర ఆలయాన్ని ఎస్పీ శనివారం సందర్శించారు. స్థానిక పోలీసులతో పాటు ఆలయ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లడారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి, పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి జన్మదినానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
భక్తులు పోలీసు శాఖకు సహకరించి, సమయానికి ఆలయాన్ని సందర్శించాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పోలీసులు, ఇతర అధికారులు భద్రతపై మరింత నిశితంగా పనిచేస్తున్నారని వెల్లడించారు.
– శెనార్తి మీడియా, బాసర