Minister Ponnam
Minister Ponnam

Minister Ponnam: ఇల్లు లేని నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు

  • పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
  • ఎంపికలో రాజకీయ జోక్యం లేదు
  • గ్రామాల్లో లబ్ధిదారుల పేర్లను డిస్ ప్లే చేయాలి
  • రెండు నెలల్లో రెండో విడత ఎంపిక..
  • రాని వారు నిరాశ చెందవద్దు
  • గత పదేళ్లలో ఏ గ్రామానికి డబుల్ బెడ్ రూం రాలేదు..
  • ఇప్పుడు ఊరూరికి ఇస్తున్నాం
  • గ్రామాల్లో అందరూ కూర్చొని సయోధ్య కుదుర్చుకోవాలి
  • అనర్హులకు ఎంపిక చేస్తే చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్లు ..ఇల్లు లేని నిరుపేదలకు అర్హులుగా ఎంపిక చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఎవరైనా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు వస్తె తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక లో అవినీతి ఆస్కారం జరిగి అనర్హుల ఎంపిక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తరువాత ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఎంపిక జరగాలని పేర్కొన్నారు. అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పేర్లను గ్రామాల్లో డిస్ ప్లే చేయాలని ఆదేశించారు.

గత పది సంవత్సరాల్లో ఏ గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ రాలేదని, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామానికి వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇళ్లు రాని వారు నిరాశపడాల్సిన అవసరం లేదని రెండు నెలల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇల్ల లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక లో గ్రామాల్లో సయోధ్య లేక ఇబ్బందులు పడవద్దని గ్రామాల్లో అందరూ కూర్చొని అర్హతలో అతిపెదవాడికి ఇల్లు రావాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

– శెనార్తి మీడియా, కరీంనగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *