ACB: కరీంనగర్ జిల్లా కేశవపట్నం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న మల్లేశం నాలా కన్వర్షన్ కోసం లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు చిక్కాడు. మండలంలోని ఓ వ్యక్తి నాలా కన్వర్షన్ కోసం డిప్యూటీ తహసీల్దార్ ను సంప్రదించాడు. ఇందకు డిప్యూటీ తహసీల్లార్ మల్లేశం రూ. 6వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు శనివారం డిప్యూటీ తహసీల్దార్ మల్లేశంను డబ్బులతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
-శెనార్తి మీడియా,శంకరపట్నం :