- పురిటి నొప్పులతో అలర్ట్ అయిన రైల్వే సిబ్బంది…
- రైల్వే అధికారుల తక్షణ స్పందన – తల్లి, బిడ్డ క్షేమం…
- బాసర స్టేషన్ వద్ద రైలు భోగిలో ఆవిర్భవించిన కొత్త జీవం
BABY BIRTH IN TRAIN : నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద రైలు భోగిలో పండంటి మగ బిడ్డకు ఓ తల్లి జన్మనిచ్చిన ఘటన గురువారం బాసర రైల్వే స్టేషన్ లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… నిజామాబాదు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మహారాష్ట్ర లోని ధర్మబాద్ మండలం కర్కెళ్లి గ్రామానికి చెందిన నాగేశ్వరి(32) (NAGESHWARI) చికిత్స పొంది మహారాష్ట్రలోని కర్కేల్లి గ్రామానికి నిజామాబాద్ లో కాచిగూడ – నాగర్సోల్ రైలు ఎక్కింది.. పురిటి నొప్పులు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు రైల్వే పోలీస్ సురేష్ (SURESH), స్టేషన్ మేనేజర్ రవీందర్ (RAVINDER)కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు స్థానిక అంబులెన్స్ కు కాల్ చేసి వెంటనే బైంసా ఆసుపత్రికి తరలించారు.. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని అంబులెన్సు పైలెట్ నవీన్ తెలిపారు.. రైల్వే అధికారులకు సిబ్బంది కి ప్రయాణికులు అభినందించారు.
శెనార్తి మీడియా : బాసర