- వ్యాపార, వాణిజ్య రంగాల నిర్ణయం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్
FOREST : మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ ఫారెస్టు పరిధిలో రాత్రి వేళల్లో ప్రయాణించరాదనే ఆంక్షలతో పట్టణ, మండల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ బుధ వారం ఒక్క రోజు స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు మరొక్క అడుగు ముందు కేసి ఫారెస్టు సిబ్బందికి ఇక ముందు ఎలాంటి సహాయ, సహకారాలు అందించబోమనే నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మన జన్నారంతో ఇతర వాట్సప్ గ్రూపులలో ‘అటవీ శాఖ వారికి మా షాపులో ప్రవేశం లేదు. ఎలాంటి వస్తువులు ఇవ్వబడవు’ పేరిట మెసేజ్ దావానంలో వ్యాపించడంతో అటవీ సిబ్బంది ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు తాము అనుసరిస్తున్నామని, ఇది వ్యక్తి గత నిర్ణయం కాదని ఫారెస్ట్ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇదే అమలయితే అటవీ శాఖాధికారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే…

– శెనార్తి మీడియా, మంచిర్యాల :