- ర్యాంకులు మావి.. డబ్బుులు మీవి
- ఇదేనా విద్యా సేవా అని ప్రశ్నిస్తున్న పేరెంట్స్, సోషల్ మీడియా
- పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పై తల్లిదండ్రుల విమర్శలు
- ఫీజు చెల్లించకుంటే వేధింపులు
- పరీక్ష ఫీజు చెల్లింపు సమయంలో ముక్కు పిండి మరీ వసూలు
- చెల్లింపు ఆలస్యమైతే ఫైన్లతో ఎగ్జామ్ ఫీజు వసూళ్లు..
- క్యాంపెయిన్ లో ఇస్తున్న హామీలకు.. వాస్తవానికి పొంతనేది అంటున్న పేరెంట్స్
Alphores : అల్ఫోర్స్… ఉత్తర తెలంగాణ (North telangana)లో ఈ విద్యా సంస్థలకు మంచి పేరున్నది. ఆ విద్యా సంస్థలో మంచి మార్కులతో పాసవుతారని ప్రింట్, ఎలక్ట్రానికి మీడియాలో కుప్పలు కుప్పలుగా యాడ్స్ వస్తుంటాయి. అయితే ఆ విద్యా సంస్థలో చదివేది ఎంత మంది.. పాసయ్యేది ఎంత మంది అనే విషయం మాత్రం బయటికి రాదు. కానీ ఏటా వివిధ పరీక్షల ఫలితాల విడుదల రోజు మాత్రం అన్ని ర్యాంకులు మావేనంటూ ప్రచారం. కానీ లోపల జరిగేది అంతా వేరే.
ముందుగానే వడపోత..
ఆ విద్యా సంస్థలో చదివే వాళ్లను ముందుగానే వడపోస్తారు. స్టూడెంట్ అప్పటికే మెరిట్ అయ్యి ఉండాలి. ఫీజులో కన్సెషన్ పేరిట టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఫీజులో రాయితీ ఉంటుంది. అంతే తప్ప ఉదారభావంతోనో.. సేవాభావంతోనే ఫీజుల తగ్గింపులు ఉండవు. ఇక అందులో పేద విద్యార్థులు చదవాలంటే ఆకాశానికి నిచ్చెన వేసినట్లే. ఆ విద్యార్థికి వచ్చిన మార్కులు, చెల్లించే ఫీజు ఆధారంగానే అడ్మిషన్లు ఇస్తారు. అయితే ఈ ఫీజు తక్కువగానే ఉంటుందనుకోవడం భ్రమే. ఒక్కో విద్యార్థి ఏడాదికి రూ. లక్షకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే.
ఆ మాత్రం ఫీజు చెల్లించాల్సిందే..
ఇందులో తమ పిల్లలను చదివించేందుకు కాస్త డబ్బులున్న వారు అడ్మిషన్ల కోసం వెంపర్లాడుతుంటారు.వాళ్లకు ఫీజు తక్కువేం ఉండదు. రాయితీ కోసం పొలిటికల్ లీడర్లతో ఫోన్లు చేయించినా ఆ సార్ ఫోన్ రిసీవ్ చేసుకోడు. తమ విద్యా సంస్థలో చదవాలంటే ఆ మాత్రం ఫీజు చెల్లించాల్సిందేనని అక్కడి సిబ్బంది చెబుతుంటారు. కానీ ఫీజులో రాయితీ మాత్రం రాదు. టాలెంట్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఫీజు చెల్లింపు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎవరి పైరవీలు సాగవు.
సిబ్బందికి టార్గెట్లు..
ఇక ఆ విద్యాసంస్థలో పని చేసే బోధన, బోధనేతర సిబ్బంది కూడా అడ్మిషన్ల సమయంలో టార్గెట్లు ఉంటాయి. సమ్మర్ హాలీడేస్ లో సిబ్బంది అడ్మిషన్ల కోసం తమకు తెలిసిన వారిని, పాత విద్యార్థుల ద్వారా క్షేత్ర స్థాయిలో తిరుగుతూ ఉంటారు. తెచ్చిన అడ్మిషన్ల ఆధారంగానే జీతాల ఇంక్రిమెంట్ ఉంటుందని సమాచారం.
ఫీజు చెల్లింపు ఆలస్యమైతే ఫైన్ తో వసూలు

ఇంటర్ విద్యార్థులైతే తమ పరీక్ష ఫీజు(Exam fees) చెల్లింపునకు ముందుగానే ఇయర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షల ఫీజు సమయానికి చెల్లించకుంటే.. ఫైన్ తో ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తారు. విద్యార్థి భవిష్యత్ తోని ఆడుకుంటారు. తల్లిదండ్రులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. ఫీజు చెల్లించేందుకు కాస్త సమయం కావాలని సంప్రదించడానికి వెళ్తే సదరు విద్యా సంస్థ అధినేత అందుబాటులో ఉండరు. దీంతో తల్లిదండ్రుల తమ పిల్లల కోసం ఎలాగోలా అప్పులు చేసి ఫీజు చెల్లిస్తుంటారు. చెల్లించని వారిని ఎగ్జామ్ ఫీజు ఫైన్ డేట్ వరకు వెయిట్ చేయిస్తారు. ఇక తానేదో ఉదారవాదినని చెప్పుకునేందుకు ఫైన్ తో ఎగ్జామ్ ఫీజు కట్టించకుంటారు. హాల్ టికెట్లు ఇచ్చే సమమంలో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఇలా తల్లిదండ్రులు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు.
ఫలితాల కోసం ఒత్తిడి
ఇక ఇంటర్, మెడిసిన్, ఇంజినీరింగ్ లో తాము అనుకున్న ఫలితాలు రావాలి. రిజల్ట్ కోసం అటు లెక్చరర్లు, ఇటు విద్యార్థులపై ఒత్తిడి. లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటున్నామని, రేపు ఫలితాల శాతం తగ్గితే మార్కెట్ తమ బ్రాండ్ పోతుందని అధినేత లెక్చరర్లపై ఒత్తిడి తెస్తుంటారు. ఈ విషయాలన్నీ బయటికి రావు. వచ్చినా తమ స్థాయిలో మేనేజ్ చేస్తుంటారు. ఇది అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వూట్కూరి నరేందర్ రెడ్డి తీరు.
క్యాంపెయిన్ లో మరో తీరు..
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దాదాపు మూడు, నాలుగు నెలల ముందు నుంచే తన ప్రచారం సాగిస్తున్నాడు. ఎన్నో హామీలిస్తున్నాడు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయిస్తామని చెబుతున్నారు.
మరి ఎన్నికలకు ముందు ఈ ఉదారగుణం ఎందుకు రాలేదని నిరుద్యోగులు, యువకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం తాను గెలవాలనే ఆకాంక్షతోనే పక్కా పొలిటీషియన్ గా మారాడని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో ఇస్తున్న గతంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిస్తేనే సేవా గుణం బయటకి వస్తుందా లేకుంటే రాదా అని పేర్కొంటున్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల/కరీంనగర్