ePOS Machines:మంచిర్యాల డివిజన్లోని ఎరువుల విక్రయ డీలర్లకు కొత్త ఈపీఓఎస్ యంత్రాలను పంపిణీ చేశారు. శుక్రవారం సీతరాంపల్లిలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన (D.A.O KALPANA) ఈ యంత్రాలను డీలర్లకు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీఐసీ ఫెర్టిలైజర్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈపీఓఎస్ యంత్రాల ద్వారా ఆధార్ కార్డు, భూమి వివరాలు, పంటల ఆధారంగా రైతులకు ఎరువులు పంపిణీ చేయనున్నారు. ఇది వ్యవహారాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చనుందని అధికారులు పేర్కొన్నారు.
రైతుల అవసరాలకు అనుగుణంగా సరైన ఎరువులు అందించేందుకు ఈపీఓఎస్ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు వ్యవసాయ అధికారి కల్పన తెలిపారు. డీలర్లు ఈ విధానానికి సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యవసాయ అధికారి అనిత, ఎస్పీఐసీ కంపెనీ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. డీలర్లకు ఈ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి, జనారం మండలాలకు చెందిన డీలర్లు హాజరయ్యారు. కొత్త విధానం ద్వారా రైతులు అవసరమైన ఎరువులను సమయానుసారం సులభంగా పొందగలుగుతారని అధికారులు చెప్పారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల