- జాతీయ రహదారి పక్కనుంచే అక్రమంగా రవాణా
- అధికారుల ‘మౌనం’.. దందాకు మార్గం సుగమం..?
SOIL MAFIYA : మంచిర్యాల–చంద్రాపూర్ జాతీయ రహదారి పక్కన వేలాది రూపాయల విలువైన మట్టి, మొరం టిప్పర్ల ద్వారా పగటి పూటే అక్రమంగా తరలుతున్నది. వందల ట్రిప్పుల మట్టి అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల రాయల్టీ నష్టం కలిగిస్తున్నా సంబంధిత శాఖలు మాత్రం మౌనంగా ఉండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది.
నిత్యం సాగుతున్న అక్రమ రవాణా…
జాతీయ రహదారి పక్క నుంచే ఈ మట్టి దందాగా సాగుతున్నది. రెవెన్యూ, పోలీసు వాహనాలు అక్కడక్కడే గస్తీగా తిరుగుతున్నా.. టిప్పర్ల ర్యాలీ మాత్రం అధికారులకు కనిపించడం లేదు. ఈ మట్టి అక్రమ దంగా అధికారులకు ఏమాత్రం తెలియదనుకుంటే పొరపాటే. కండ్ల ముందు మట్టి తరలుతున్నా స్పందించకపోడంపై స్థానికులు మండపడిపడుతున్నారు.
ఎన్హెచ్ఏఐ పేరిట.. అడ్దదారి
దందాలో భాగస్వాములైన కాంట్రాక్టర్లు మాట్లాడుతూ తమను ఎన్హెచ్ ఏఐ వాళ్లే పంపించారు. మేము ఎవరి అనుమతి తీసుకోవాల్సిన పని లేదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది చట్టాన్ని అతిక్రమించడమే కాదు.. అధికారుల డొల్లతనాన్ని కూడా బయటపెడతున్నది.
– ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయం.. అక్రమార్కుకల జేబుల్లోకి..
ప్రతి ట్రిప్పు మట్టికి మార్కెట్ విలువ వేలల్లో ఉంటే.. రాయల్టీ రూపంలో ప్రభుత్వం అందాల్సిన ఆదాయం కూడా దక్కడం లేదు. అక్రమార్కులు అందిన కాడికి దోచుకుపోతున్నారు. బిల్లులు లేకుండా, నిబంధనలు విస్మరిస్తూ సాగుతున్న తవ్వకాలు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి.
అధికారుల వైఖరిపై ప్రజల ఆగ్రహం
తమ జేబుల కోసం పబ్లిక్ డబ్బును తాకట్టు పెడతారా? అని ప్రజలు మండిపడుతున్నారు. తహసీల్దార్ సహా ఇతర శాఖల అధికారులు మౌనంగా ఉండడ దందా నాలుగు లారీలు. పది ట్రిప్పులు అన్నట్లుగా సాగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతా బహిరంగమే కానీ..
పగటి పూటే జాతీయ రహదారి పక్కనే సాగుతున్న ఈ దందా బహిరంగంగానే సాగుతున్నది. కానీ అధికారుల నిద్రపోయినట్లు నటిస్తుండడడం అధికార వ్యవస్థల వైఫల్యాలకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఇప్పటిదాకా ఈ మట్టి తవ్వకాలపై స్పందించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
కాగా, ఈ విషయమై మందమర్రి తహసీల్దార్ సతీష్ కుమార్ను ‘శెనార్తి మీడియా’ ప్రతినిధి వివరణ కోరగా మండల పరిధిలో మట్టి తరలింపునకు ఎవరికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. మట్టి తరలిస్తున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల